రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో ఆ యువకుడు నివాసముండే ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. గంజ్, మెయిన్రోడ్డు, విజయనగర్ కాలనీ, ఈశ్వర్ కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
ఆయా ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు మూసివేశారు. అనుమానితులుగా భావించిన 20 మందిని క్వారంటైన్కి తరలించారు. పురపాలిక సిబ్బంది రంగంలోకి దిగి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. డీసీపీ ప్రకాష్ కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు