ETV Bharat / state

ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య పట్ల రాహుల్​ గాంధీ సంతాపం - ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య పట్ల రాహుల్​ గాంధీ సంతాపం

ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువు భారమై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ స్పందించారు. విద్యార్థిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాజపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్ వల్ల అనేక కుటుంబాలు నాశనం అయ్యాయాని ఆయన ట్విట్టర్​ ద్వారా ఆరోపించారు.

ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య పట్ల రాహుల్​ గాంధీ సంతాపం
ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య పట్ల రాహుల్​ గాంధీ సంతాపం
author img

By

Published : Nov 10, 2020, 5:01 AM IST

ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఫరూక్​ నగర్​కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.

    ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.

    ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha

    — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్​ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఫరూక్​నగర్​లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్​లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో ఉచిత సీట్ సాధించింది. అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల హాస్టల్​లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఈ విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండి: విద్యార్థిని ఆత్మహత్య.. ఆర్థిక పరిస్థితులే కారణం

ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఫరూక్​ నగర్​కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.

    ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.

    ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha

    — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్​ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఫరూక్​నగర్​లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్​లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో ఉచిత సీట్ సాధించింది. అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల హాస్టల్​లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఈ విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండి: విద్యార్థిని ఆత్మహత్య.. ఆర్థిక పరిస్థితులే కారణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.