ETV Bharat / state

రంగారెడ్డి డీఈవోకు ఫిర్యాదు చేసిన నటుడు శివబాలాజీ! - నటుడు శివబాలాజీ ఫిర్యాదు

కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఆన్​లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రంగారెడ్డి జిల్లా డీఈవోకు టాలీవుడ్ నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్​ తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్​లైన్ తరగతుల నుంచి తొలిగించడంపై గతంలో హెచ్చార్సీ కి ఫిర్యాదు చేసిన శివబాలాజీ.. తాజాగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

Cine Hero Shiva Balaji Complaints To Rangaareddy Deo On Mount Litera Zee School
రంగారెడ్డి డీఈవోకు ఫిర్యాదు చేసిన నటుడు శివబాలాజీ!
author img

By

Published : Sep 21, 2020, 4:47 PM IST

కార్పోరేట్​, ప్రైవేట్​ పాఠశాలల్లో ఆన్​లైన్​ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై.. సినీ నటుడు శివబాలాజీ రంగారెడ్డి జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్​లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని... అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన డీఈవో విజయలక్ష్మికి వివరించారు. పెంచిన ఫీజులు తగ్గించాలని కోరితే ఎలాంటి సమాచారం లేకుండా... తమ పిల్లలను ఆన్​లైన్​ తరగతుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఇలా అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లలను తిరిగి ఆన్​లైన్​ తరగతులకు అనుమతి ఇచ్చారని తెలిపారు. అకారణంగా తరగతుల నుంచి ఎందుకు తొలగించారని అడిగితే.. సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌంట్ లిటేరా జీ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూళ్లు చేస్తున్న విషయం... ఆన్​లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన వివరాలు డీఈవోకు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో పాఠశాల గుర్తింపు రద్దయ్యేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

కార్పోరేట్​, ప్రైవేట్​ పాఠశాలల్లో ఆన్​లైన్​ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై.. సినీ నటుడు శివబాలాజీ రంగారెడ్డి జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్​లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని... అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన డీఈవో విజయలక్ష్మికి వివరించారు. పెంచిన ఫీజులు తగ్గించాలని కోరితే ఎలాంటి సమాచారం లేకుండా... తమ పిల్లలను ఆన్​లైన్​ తరగతుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఇలా అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లలను తిరిగి ఆన్​లైన్​ తరగతులకు అనుమతి ఇచ్చారని తెలిపారు. అకారణంగా తరగతుల నుంచి ఎందుకు తొలగించారని అడిగితే.. సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌంట్ లిటేరా జీ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూళ్లు చేస్తున్న విషయం... ఆన్​లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన వివరాలు డీఈవోకు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో పాఠశాల గుర్తింపు రద్దయ్యేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండిః యాదాద్రిలో భక్తుల ఆహ్లాదం కోసం వాటర్‌ ఫౌంటైన్‌లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.