ETV Bharat / state

'తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి'

author img

By

Published : Dec 15, 2020, 2:43 PM IST

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తూ అధిష్ఠానం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

bjp protest in rajendra nagar in rangareddy district
రాజేంద్రనగర్​లో భాజపా ధర్నా

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న అధిష్ఠానం పిలుపు మేరకు ధర్నాకు దిగారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న అధిష్ఠానం పిలుపు మేరకు ధర్నాకు దిగారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.