ETV Bharat / state

ys sharmila:'నాడు రాష్ట్రం కోసం.. నేడు ఉద్యోగాల కోసం '

author img

By

Published : Aug 3, 2021, 11:25 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్​ చేశారు. ఇంటికో ఉద్యోగం హామీ నేరవేర్చలేకపోయారని.. కనీసం నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ys sharmila
ys sharmila

ఒకప్పుడు తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వందలాది మంది మళ్లీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. మహేందర్ యాదవ్ తల్లి రామవ్వ షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ys sharmila:'నాడు రాష్ట్రం కోసం.. నేడు ఉద్యోగం కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్నారు'

ఒకేసారి రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత దివంగత వైఎస్​ రాజశేఖర్​రెడ్డికే దక్కిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ప్రభుత్వం వద్దే 54 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తుకున్నారని.. వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఇంటికో ఉద్యోగం హామీ నేరవేర్చలేకపోయారని.. కనీసం నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని కోరారు. ప్రజాసమస్యలపై వైఎస్​ఆర్​టీపీ ఎప్పుడూ పోరాడుతూ ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.

'నాడు తెలంగాణ సాధన కోసం 1200 ఆత్మహత్య చేసుకొంటే.. నేడు ఉద్యోగం కోసం వందలాది మంది బలిదానాలు చేసుకుంటున్నారు. ఇదేనా కోరుకున్న తెలంగాణ. కేసీఆర్​ గడిలో తెలంగాణ బందీ అయింది. లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. భర్తీ చేయకపోవడం వల్లే ఆశ చచ్చిపోయి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం పేరిట నిరాహార దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి మీరు ఎంతటి మొనగాళ్లో నిరూపించుకోండి. '

వైఎస్​. షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇవీచూడండి: Biryani: మున్సిపల్ కమిషనర్​కు స్పెషల్ బిర్యానీ... కాకపోతే మరీ ఇంత స్పెషలా?

ఒకప్పుడు తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వందలాది మంది మళ్లీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. మహేందర్ యాదవ్ తల్లి రామవ్వ షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ys sharmila:'నాడు రాష్ట్రం కోసం.. నేడు ఉద్యోగం కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్నారు'

ఒకేసారి రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత దివంగత వైఎస్​ రాజశేఖర్​రెడ్డికే దక్కిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ప్రభుత్వం వద్దే 54 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తుకున్నారని.. వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఇంటికో ఉద్యోగం హామీ నేరవేర్చలేకపోయారని.. కనీసం నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని కోరారు. ప్రజాసమస్యలపై వైఎస్​ఆర్​టీపీ ఎప్పుడూ పోరాడుతూ ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.

'నాడు తెలంగాణ సాధన కోసం 1200 ఆత్మహత్య చేసుకొంటే.. నేడు ఉద్యోగం కోసం వందలాది మంది బలిదానాలు చేసుకుంటున్నారు. ఇదేనా కోరుకున్న తెలంగాణ. కేసీఆర్​ గడిలో తెలంగాణ బందీ అయింది. లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. భర్తీ చేయకపోవడం వల్లే ఆశ చచ్చిపోయి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం పేరిట నిరాహార దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి మీరు ఎంతటి మొనగాళ్లో నిరూపించుకోండి. '

వైఎస్​. షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇవీచూడండి: Biryani: మున్సిపల్ కమిషనర్​కు స్పెషల్ బిర్యానీ... కాకపోతే మరీ ఇంత స్పెషలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.