ETV Bharat / state

corona: 'మూడో దశ ముప్పు ఉన్నందున అప్రమత్తత అవసరం'

author img

By

Published : Jul 13, 2021, 9:10 PM IST

కొవిడ్(covid) మూడో దశ ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తాజా రిజ్వీ అన్నారు. టీకా కార్యక్రమాన్ని(vaccination) వేగవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు.

review on corona, State Health Secretary Syed Ali Murtaza Rizvi
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌అలీ ముర్తాజా రిజ్వీ , కరోనాపై సమీక్ష

కొవిడ్(covid) మూడో దశ(third wave) వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని... ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధరణ పరీక్షలు పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తాజా రిజ్వీ సూచించారు. వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఇంకా తగ్గలేదని... పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసులు(positive cases) తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు సాధించామని, మరోసారి ఈ సర్వే చేయించాలని ఆయన ఆదేశించారు. వైరస్(virus) లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో లేదా హోమ్ ఐసోలేషన్‌(home isolation)లో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యం కల్పించాలని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.

కరోనా నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, డీహెచ్​ డా.శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శ్రీరాములు, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CORONA: కరోనా వేళ తైలాల పేరుతో రూ.52 లక్షల మోసం

కొవిడ్(covid) మూడో దశ(third wave) వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని... ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధరణ పరీక్షలు పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తాజా రిజ్వీ సూచించారు. వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఇంకా తగ్గలేదని... పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసులు(positive cases) తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు సాధించామని, మరోసారి ఈ సర్వే చేయించాలని ఆయన ఆదేశించారు. వైరస్(virus) లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో లేదా హోమ్ ఐసోలేషన్‌(home isolation)లో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యం కల్పించాలని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.

కరోనా నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, డీహెచ్​ డా.శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శ్రీరాములు, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CORONA: కరోనా వేళ తైలాల పేరుతో రూ.52 లక్షల మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.