రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద గల అటవీ ప్రాంతంలో ఉన్న కోతులకు ఆహారం, పండ్లను అందజేశారు.
ఓ వైపు లాక్డౌన్, మరోవైపు వేసవి కాలం కావటం వల్ల కోతులకు ఆహారం దొరకక బక్క చిక్కి పోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే మూగజీవాలకు ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నారు.