రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ ఛైర్పర్సన్ అరుణ అధ్యక్షతన కొవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం వేములవాడలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అరుణ తెలిపారు. మంత్రి కేటీఆర్ పంపించిన రూ.రెండు కోట్ల చెక్కును డీఎంహెచ్ అధికారి, ఆసుపత్రి సూపరింటెండెండ్కు అందజేశారు.
కొవిడ్ నియంత్రణ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లాలోని పీహెచ్సీల్లో అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు అరుణ తెలిపారు. కొవిడ్ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేస్తామని.. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్