సెప్టెంబర్లోగా కాళేశ్వరం నీళ్లొస్తాయి: కేటీఆర్ - trs working president
కేసీఆర్ దార్శనికత వల్ల వచ్చే సెప్టెంబర్లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
మల్కాపూర్ రిజర్వాయర్ సందర్శించిన కేటీఆర్
By
Published : Feb 5, 2019, 7:00 AM IST
మల్కాపూర్ రిజర్వాయర్ సందర్శించిన కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో.. విదేశీ స్థాయిలో మన రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ రిజర్వాయర్తో పాటు, 9, 10 ప్యాకేజీ పనులను పరిశీలించారు. గ్రావిటీ కాల్వ, భూగర్భంలో జరుగుతున్న టన్నల్ పనులపై ఏజెన్సీ ప్రతినిధులను ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. సిరిసిల్ల జిల్లాలోను 2 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించే పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాత్తర ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ఇంజినీర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
మల్కాపూర్ రిజర్వాయర్ సందర్శించిన కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో.. విదేశీ స్థాయిలో మన రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ రిజర్వాయర్తో పాటు, 9, 10 ప్యాకేజీ పనులను పరిశీలించారు. గ్రావిటీ కాల్వ, భూగర్భంలో జరుగుతున్న టన్నల్ పనులపై ఏజెన్సీ ప్రతినిధులను ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. సిరిసిల్ల జిల్లాలోను 2 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించే పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాత్తర ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ఇంజినీర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.