ETV Bharat / state

'సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికలు జరగనివ్వం' - gollapalli panchayat in sircilla district

సరిహద్దు సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించకూడదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతనంగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కారమవ్వకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్​ను బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Gollapalli panchayat, border issue, election boycott
గొల్లపల్లి పంచాయతీ, సరిహద్దు సమస్య, ఎన్నికల బహిష్కరణ
author img

By

Published : Mar 30, 2021, 11:29 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామంలో సరిహద్దు సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్​ బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా.. తమ సమస్యలు పరిష్కరించలేదని పోలింగ్​ను బహిష్కరించారు. 148 మంది ఓటర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అన్యాయంగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించే వరకు సర్పంచ్​ ఎన్నికలు జరగనివ్వమని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీపీ వెంకటరమణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామంలో సరిహద్దు సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్​ బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా.. తమ సమస్యలు పరిష్కరించలేదని పోలింగ్​ను బహిష్కరించారు. 148 మంది ఓటర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అన్యాయంగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించే వరకు సర్పంచ్​ ఎన్నికలు జరగనివ్వమని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీపీ వెంకటరమణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.