రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన గొల్లపల్లి గ్రామంలో సరిహద్దు సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. సమస్య పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే పోలింగ్ బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా.. తమ సమస్యలు పరిష్కరించలేదని పోలింగ్ను బహిష్కరించారు. 148 మంది ఓటర్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అన్యాయంగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించే వరకు సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వమని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీపీ వెంకటరమణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.