గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండికొడుతూ వస్తున్న ఎడ్ల శ్రీనివాస్పై ఎట్టకేలకు రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్లో అతను తెలంగాణ వీరప్పన్గా ఎదిగాడు. 4 రాష్ట్రాల్లో కలపను అక్రమంగా రవాణా చేస్తూ అటవీ, పోలీస్ అధికారులకు చిక్కకుండా మాఫియా సామ్రాజ్యంను విస్తరించాడు. ఈ ముఠాను ఏప్రిల్ 9న రామగుడం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి కొందరి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కలప స్మగ్లర్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు రామగుండం సీపీ సత్యనారాయణ రివార్డులను అందజేశారు.
ఇవీ చూడండి: ఒడిశాలో ఎన్కౌంటర్- ఐదుగురు నక్సల్స్ హతం