ETV Bharat / state

జలసంరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ - rally to save water

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 'జల సంరక్షణ- జన్ ఆందోళన' పేరుతో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దీనిని జిల్లా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి ప్రారంభించారు.

జలసంరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Jul 15, 2019, 5:06 PM IST


నీటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు 'జల సంరక్షణ- జన్ ఆందోళన' పేరుతో ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా నీటి సంరక్షణకు పాటుపడాలి అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకొని జాగ్రత్తలు పాటించాలని జిల్లా పాలనాధికారి కోరారు. ప్రకృతి ప్రసాదించిన వర్షపునీటిని ఒడిసి పట్టి నీటిని కాపాడుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.

జలసంరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ

ఇదీ చదవండిః పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా


నీటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు 'జల సంరక్షణ- జన్ ఆందోళన' పేరుతో ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా నీటి సంరక్షణకు పాటుపడాలి అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకొని జాగ్రత్తలు పాటించాలని జిల్లా పాలనాధికారి కోరారు. ప్రకృతి ప్రసాదించిన వర్షపునీటిని ఒడిసి పట్టి నీటిని కాపాడుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.

జలసంరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ

ఇదీ చదవండిః పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల ధర్నా

Intro:ఫైల్: TG_KRN_42_15_JALA SAMRAKSHANA RALY_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: ప్రకృతి ప్రసాదించిన వర్షపునీటిని ఒడిసి పట్టి నీటిని కాపాడుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. నీటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు జల సంరక్షణ- జన్ ఆందోళన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాజీవ్ రహదారి తో పాటు పురవీధుల గుండా ప్రచార ర్యాలీ నిర్వహించారు. ప్రజలంతా నీటి సంరక్షణకు పాటుపడాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటిని అధికంగా వృధా చేయడం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని ఒడిసి పట్టి జల సంరక్షణ లో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకొని జాగ్రత్తలు పాటించాలని కోరారు. విద్యార్థులు ప్రజలకు నీటి ఆవశ్యకతను వివరించాలని పేర్కొన్నారు.
bite: దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యేBody:లక్ష్మణ్Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.