ETV Bharat / state

పెద్దపల్లిలో పోలింగ్​కు సర్వం సిద్ధం

రాష్ట్రంలో ఓట్ల పండుగకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం యంత్రాలను సిబ్బంది ఆయా కేంద్రాలకు తరలించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు అదనపు బలగాలు మోహరించారు. మొత్తం 1835 కేంద్రాల్లో ఓటరు దేవుళ్లు ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 8:11 PM IST

పెద్దపల్లి పోలింగ్​

పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి అనుసంధానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1835 పోలింగ్​ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 307 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం పదివేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్​ పూర్తి కానుండగా... మంథనిలో 4 గంటల వరకే ఓటు వేయడానికి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఓటర్లు ఇలా..

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,78,062 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,39,633 మంది కాగా.. మహిళా ఓటర్లు 7,38,346 ఉన్నారు.

భద్రత కట్టుదిట్టం

పోలింగ్​ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బరిలో 17 మంది

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస నుంచి బోర్లగుంట వెంకటేశ్​, కాంగ్రెస్​ తరఫున ఆగం చంద్రశేఖర్​, భాజపా నుంచి ఎస్​ కుమార్​ పోటీ పడుతున్నారు.

పోలింగ్​ శాతం పెంచేలా చర్యలు

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్​ దేవసేన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు నిర్భయంగా ఓటెయ్యాలని సూచించారు.

పెద్దపల్లిలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

ఇదీ చదవండి : పంతంగి టోల్​గేట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​

పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి అనుసంధానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1835 పోలింగ్​ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 307 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం పదివేల మందికి పైగా సిబ్బందిని నియమించినట్లు జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్​ పూర్తి కానుండగా... మంథనిలో 4 గంటల వరకే ఓటు వేయడానికి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఓటర్లు ఇలా..

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,78,062 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,39,633 మంది కాగా.. మహిళా ఓటర్లు 7,38,346 ఉన్నారు.

భద్రత కట్టుదిట్టం

పోలింగ్​ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బరిలో 17 మంది

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస నుంచి బోర్లగుంట వెంకటేశ్​, కాంగ్రెస్​ తరఫున ఆగం చంద్రశేఖర్​, భాజపా నుంచి ఎస్​ కుమార్​ పోటీ పడుతున్నారు.

పోలింగ్​ శాతం పెంచేలా చర్యలు

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్​ దేవసేన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు నిర్భయంగా ఓటెయ్యాలని సూచించారు.

పెద్దపల్లిలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

ఇదీ చదవండి : పంతంగి టోల్​గేట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​

Intro:ఫైల్: TG_KRN_41_10_PEDDAPALLI OVERAL_PKG_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి 8008573603
యాంకర్: పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అనుసంధానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లోని పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ధర్మపురి, మంథని, రామగుండం
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా1478000 మంది ఓటర్లు ఉండగా 1835 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 307 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు పదివేల మందికిపైగా పోలింగ్ సిబ్బంది ని నియమించినట్లు ఎన్నికల అధికారి శ్రీ దేవసేన వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా కేవలం మంథని నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 3000 మంది పోలీసు బలగాలను నియమించగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక పెద్ద పెళ్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన తెరాస నుంచి బోర్ల గుంట వెంకటేష్ నేత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆగం చంద్రశేఖర్, భాజపా తరఫున ఎస్.కుమార్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి శ్రీ దేవసేన వెల్లడించారు.
బైట్: శ్రీ దేవసేన, ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.