ETV Bharat / bharat

జమిలి ఎన్నికలపై 31మందితో జేపీసీ- కమిటీలో అనురాగ్‌, ప్రియాంక, హరీష్‌ బాలయోగికి చోటు - ONE NATION ONE ELECTION PANEL

జమిలి ఎన్నికల బిల్లుల పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

One Nation One Election Panel
One Nation One Election Panel (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2024, 9:40 PM IST

Updated : Dec 19, 2024, 7:01 AM IST

One Nation One Election Panel : జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్‌సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల చివరి వారంలో తొలిరోజున నివేదికను సభ ముందుంచాలని గడువు విధించారు. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.

కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేశ్‌ (బీజేపీ- అనకాపల్లి), వల్లభనేని బాలశౌరి (జనసేన- మచిలీపట్నం), జి.ఎం.హరీశ్‌ బాలయోగి (తెదేపా- అమలాపురం)కు స్థానం కల్పించారు. బీజేపీ ఎంపీలైన పీపీ చౌధరి (రాజస్థాన్‌), భాన్సురీ స్వరాజ్‌ (దిల్లీ), పురుషోత్తం రూపాలా (గుజరాత్‌), అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), విష్ణుదయాళ్‌రాం (ఝార్ఖండ్‌), భర్తృహరి మహతాబ్‌ (ఒడిశా), సంబిత్‌పాత్ర (ఒడిశా), అనిల్‌బలూని (ఉత్తరాఖండ్‌), విష్ణుదత్‌ శర్మ (మధ్యప్రదేశ్‌) ఈ కమిటీలో ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి ప్రియాంకాగాంధీ (కేరళ), మనీశ్‌ తివారీ (చండీగఢ్‌), సుఖ్‌దేవ్‌ భగత్‌ (ఝార్ఖండ్‌); ఎస్‌పీ తరఫున ధర్మేంద్ర యాదవ్‌ (యూపీ), టీఎంసీ నుంచి కల్యాణ్‌బెనర్జీ (బంంగాల్‌), డీఎంకే నుంచి సెల్వగణపతి (తమిళనాడు); ఎన్సీపీ-ఎస్పీ నుంచి సుప్రియా సూలె, శివసేన నుంచి శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ శిందే (మహారాష్ట్ర), ఆర్‌ఎల్‌డీ నుంచి చందన్‌చౌహాన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)కు అవకాశం కల్పించారు.

ఇందులో పీపీ చౌధరి, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ ఇదివరకు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సీఎం రమేశ్‌ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, ఇప్పుడు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. బాలశౌరి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. హరీశ్‌ తొలిసారి ఎన్నికయ్యారు. మహతాబ్‌ 7వసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన సభ్యుల్లో అందరికంటే సీనియర్‌ పీపీ చౌధరి. కమిటీకి ఆయనే నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. రాజ్యసభ నుంచి ఎంపిక చేసిన సభ్యుల వివరాలు ఇంకా వెలువడలేదు.

One Nation One Election Panel : జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్‌సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల చివరి వారంలో తొలిరోజున నివేదికను సభ ముందుంచాలని గడువు విధించారు. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.

కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేశ్‌ (బీజేపీ- అనకాపల్లి), వల్లభనేని బాలశౌరి (జనసేన- మచిలీపట్నం), జి.ఎం.హరీశ్‌ బాలయోగి (తెదేపా- అమలాపురం)కు స్థానం కల్పించారు. బీజేపీ ఎంపీలైన పీపీ చౌధరి (రాజస్థాన్‌), భాన్సురీ స్వరాజ్‌ (దిల్లీ), పురుషోత్తం రూపాలా (గుజరాత్‌), అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), విష్ణుదయాళ్‌రాం (ఝార్ఖండ్‌), భర్తృహరి మహతాబ్‌ (ఒడిశా), సంబిత్‌పాత్ర (ఒడిశా), అనిల్‌బలూని (ఉత్తరాఖండ్‌), విష్ణుదత్‌ శర్మ (మధ్యప్రదేశ్‌) ఈ కమిటీలో ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి ప్రియాంకాగాంధీ (కేరళ), మనీశ్‌ తివారీ (చండీగఢ్‌), సుఖ్‌దేవ్‌ భగత్‌ (ఝార్ఖండ్‌); ఎస్‌పీ తరఫున ధర్మేంద్ర యాదవ్‌ (యూపీ), టీఎంసీ నుంచి కల్యాణ్‌బెనర్జీ (బంంగాల్‌), డీఎంకే నుంచి సెల్వగణపతి (తమిళనాడు); ఎన్సీపీ-ఎస్పీ నుంచి సుప్రియా సూలె, శివసేన నుంచి శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ శిందే (మహారాష్ట్ర), ఆర్‌ఎల్‌డీ నుంచి చందన్‌చౌహాన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)కు అవకాశం కల్పించారు.

ఇందులో పీపీ చౌధరి, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ ఇదివరకు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సీఎం రమేశ్‌ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, ఇప్పుడు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. బాలశౌరి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. హరీశ్‌ తొలిసారి ఎన్నికయ్యారు. మహతాబ్‌ 7వసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన సభ్యుల్లో అందరికంటే సీనియర్‌ పీపీ చౌధరి. కమిటీకి ఆయనే నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. రాజ్యసభ నుంచి ఎంపిక చేసిన సభ్యుల వివరాలు ఇంకా వెలువడలేదు.

Last Updated : Dec 19, 2024, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.