పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జూలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు చెందిన లారీలో అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో బియ్యంతో సహా.. లారీని పట్టుకున్నారు. సుల్తానాబాద్ ప్రాంతంలో పోలీసులు కాపు కాసి.. రూ.5 లక్షలు విలువ చేసే.. 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం, నలుగురు వ్యక్తులను ఆధీనంలోకి తీసుకున్నట్టు రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు అందించిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తక్కువ రేటుకు కొని.. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రామగుండం సీపీ తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'