ETV Bharat / state

దళిత వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి కొప్పుల

author img

By

Published : Feb 28, 2021, 7:59 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ ఆశయ సాధనకు యువత పాటుపడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ సూచించారు. దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి జిల్లా భీమారిపల్లిలో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Minister Koppula unveils Ambedkar statue in peddapalli district
దళిత వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమారిపల్లిలో డాక్టర్​ బి.ఆర్​.అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై.. ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత పాటుపడాలని​ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, ఎంపీపీ కూనారపు రేణుకా దేవి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమారిపల్లిలో డాక్టర్​ బి.ఆర్​.అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై.. ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత పాటుపడాలని​ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, ఎంపీపీ కూనారపు రేణుకా దేవి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.