ETV Bharat / state

ఎన్టీపీసీ వద్ద వలస కార్మికుల ఆందోళన

author img

By

Published : May 3, 2020, 11:31 AM IST

రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలని కోరుతూ నిరసనకు దిగారు.

Migrant workers agitation on NTPC Rajiv road
ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బీహార్​, మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​ రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు నిరసనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కార్మికులను చెదరగొట్టారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బీహార్​, మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​ రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు నిరసనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కార్మికులను చెదరగొట్టారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు.

ఇదీ చూడండి: రాజస్థాన్ వాసులను అడ్డుకున్న మెట్​పల్లి పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.