పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది కార్మికులు నిరసనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కార్మికులను చెదరగొట్టారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్లో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు.
ఇదీ చూడండి: రాజస్థాన్ వాసులను అడ్డుకున్న మెట్పల్లి పోలీసులు