ETV Bharat / state

'ఎల్​ఐసీ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలి' - పెద్దపల్లి వార్తలు

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్​కు అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఎల్​ఐసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రజల ఆస్తులను ప్రైవేటీకరణ చేయడాన్ని సీఐటీయూ నేత ముత్యం రావు ఖండించారు.

lic employees dharna at peddapalli  on privatization public sector organization
'ఎల్​ఐసీ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలి'
author img

By

Published : Mar 18, 2021, 5:29 PM IST

ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించి సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణను సీఐటీయూ నేత ముత్యం రావు ఖండించారు. ఉద్యోగులు, వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం

ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించి సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణను సీఐటీయూ నేత ముత్యం రావు ఖండించారు. ఉద్యోగులు, వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.