ETV Bharat / state

'మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సై ఓంకార్ యాదవ్ తమను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని మల్లారం గ్రామానికి చెందిన సాయిని సరిత, సాయిని రమేష్ హెచ్​ఆర్సీ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. తమ తండ్రి పేరున ఉన్న 10 గుంటల భూమిని తమ బాబాయ్ ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

author img

By

Published : Sep 7, 2020, 3:55 PM IST

Updated : Sep 7, 2020, 10:17 PM IST

'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'
'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సై ఓంకార్ యాదవ్ తమను వేధిస్తున్నాడని మల్లారం గ్రామానికి చెందిన సాయిని సరిత, సాయిని రమేష్ హెచ్​ఆర్సీ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. తమ తండ్రి పేరుపై ఉన్న 10 గుంటల భూమిని తమ బాబాయ్ ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 30న బాబాయ్ సాయిని వెంకన్న, పిన్ని పద్మ, వారి కొడుకు అవినాష్​లు తమ కుటుంబంపై దాడి చేసినట్లు కమిషన్​ దృష్టికి తీసుకెళ్లారు.

'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'
'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

మంథని ఠాణాలో ఫిర్యాదు..

ఈ వ్యవహారంపై మంథని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు సైతం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఎస్సై ఓంకార్ యాదవ్ తమ 10 గుంటల భూమిని వదులుకోవాలని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. అనంతరం విచక్షణా రహితంగా చితకబాదారని ఆందోళన వ్యక్తం చేశారు.

'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'
'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

అన్న కుమార్తెను వివస్త్రగా..

తమ బాబాయ్, మహిళ అని కూడా చూడకుండా తనను వివస్త్రను చేసి కొట్టినట్లు బాధితురాలు సాయిని సరిత వాపోయారు.

ఆ కుటుంబం నుంచి ప్రాణహాని..

తమకు, తమ కుటుంబానికి బాబాయ్ సాయిని వెంకన్న కుటుంబం, ఎస్సై ఓంకార్ యాదవ్ నుంచి ప్రాణహాని ఉందని కమిషన్​కు గోడు వెళ్లబోసుకున్నారు.

ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి..

కబ్జాదారులకు మద్దతు ఇస్తున్న ఎస్​ఐపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు. తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘం కమిషన్ ఛైర్మన్​ను వేడుకున్నారు.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సై ఓంకార్ యాదవ్ తమను వేధిస్తున్నాడని మల్లారం గ్రామానికి చెందిన సాయిని సరిత, సాయిని రమేష్ హెచ్​ఆర్సీ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. తమ తండ్రి పేరుపై ఉన్న 10 గుంటల భూమిని తమ బాబాయ్ ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 30న బాబాయ్ సాయిని వెంకన్న, పిన్ని పద్మ, వారి కొడుకు అవినాష్​లు తమ కుటుంబంపై దాడి చేసినట్లు కమిషన్​ దృష్టికి తీసుకెళ్లారు.

'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'
'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

మంథని ఠాణాలో ఫిర్యాదు..

ఈ వ్యవహారంపై మంథని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు సైతం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఎస్సై ఓంకార్ యాదవ్ తమ 10 గుంటల భూమిని వదులుకోవాలని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. అనంతరం విచక్షణా రహితంగా చితకబాదారని ఆందోళన వ్యక్తం చేశారు.

'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'
'హెచ్​ఆర్సీ ఛైర్మన్ గారూ ! మాకు ప్రాణహాని ఉంది.. న్యాయం చేయండి'

అన్న కుమార్తెను వివస్త్రగా..

తమ బాబాయ్, మహిళ అని కూడా చూడకుండా తనను వివస్త్రను చేసి కొట్టినట్లు బాధితురాలు సాయిని సరిత వాపోయారు.

ఆ కుటుంబం నుంచి ప్రాణహాని..

తమకు, తమ కుటుంబానికి బాబాయ్ సాయిని వెంకన్న కుటుంబం, ఎస్సై ఓంకార్ యాదవ్ నుంచి ప్రాణహాని ఉందని కమిషన్​కు గోడు వెళ్లబోసుకున్నారు.

ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి..

కబ్జాదారులకు మద్దతు ఇస్తున్న ఎస్​ఐపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్​ను కోరారు. తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘం కమిషన్ ఛైర్మన్​ను వేడుకున్నారు.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

Last Updated : Sep 7, 2020, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.