ETV Bharat / state

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... వ్యాధులకు దూరంగా ఉండండి' - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా నగరంలోని తన ఇంట్లో పరిసరాలను శుభ్రం చేశారు.

every sunday 10am 10 minutes program
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... వ్యాధులకు దూరంగా ఉండండి'
author img

By

Published : Aug 2, 2020, 4:49 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు పాల్గొన్నారు. నగరంలోని తన ఇంట్లో సీజనల్​ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. పూలకుండీలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుంకొని.. డెంగీ, కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలన్నారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు పాల్గొన్నారు. నగరంలోని తన ఇంట్లో సీజనల్​ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. పూలకుండీలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుంకొని.. డెంగీ, కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలన్నారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.