నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ పాటిల్, మేయర్ నీతూ కిరణ్, ఇతర మహిళా ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ ఆడిటోరియం, టీఎన్జీవోస్ కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఆటపాటలతో కాసేపు సరదాగా గడిపారు.
![ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు womensday celebrations in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10920218-114-10920218-1615197868319.jpg?imwidth=3840)
మరోవైపు టీఎన్జీవోస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మహిళలపై పాట పాడి అక్కడి వారిని ఉత్సాహపరిచారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ పాటిల్, మేయర్ నీతూ కిరణ్, ఇతర మహిళా ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మరోవైపు టీఎన్జీవోస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మహిళలపై పాట పాడి అక్కడి వారిని ఉత్సాహపరిచారు.