నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ దేశాల్లోకి మన సంస్కృతి, సంప్రదాయం ఎంతో పవిత్రమైందని జిల్లా ధర్మజాగరణ సేవా ప్రముఖ్ మల్లేష్ చెప్పారు. దేశంలోని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటునట్లు తెలిపారు. చక్కని కుటుంబ వ్యవస్థ ఉన్న దేశం మనదని అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్ఎస్ఎస్ వివిధ పేర్లతో కొనసాగుతుందని వివరించారు. విజయదశమి చెడుపై మంచి విజయానికి సూచిక అని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్థానిక సేవా ప్రముఖ్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు...