ETV Bharat / state

ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు

పడిపోయిన భూగర్భ జలాలు... ఎండిన బోర్లు... సరిపోని కుళాయి నీరు... వెరసి మంచి నీటి కోసం హాహాకారాలు. మూత్రశాలలు, మరుగు దొడ్లలో పోసేందుకు కూడా నీళ్లు దొరకని స్థితికి చేరుకుంది నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి. రోగులు, బంధువులు నీటి సమస్యలతో అల్లాడిపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు.

author img

By

Published : Aug 25, 2019, 1:43 PM IST

ఇందూరు దవాఖానలో దాహం తిప్పలు
ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1400 మంది చికిత్స పొందుతుంటారు. 500 మంది ఇన్ పేషేంట్​లుగా చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మరో 500 మంది వరకు వస్తుంటారు. 400 మంది వరకు ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు 3 వేల మంది వరకు ప్రతిరోజు ఆస్పత్రిలో ఉంటున్నా... వారికి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరకట్లేదు. శౌచాలయానికి వెళ్లాలన్నా... బయట నుంచి నీరు కొనుక్కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాలుగు బోర్లున్నా... చుక్క నీరు లేదు

ఇందూరు ప్రభుత్వాస్పత్రిలో మొత్తం నాలుగు బోర్లు ఉండగా... ఇటీవల భూగర్భ జలాలు పడిపోయి రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మరో రెండు బోర్లలోనూ నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆస్పత్రిలో గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది గత కొన్నాళ్లుగా మున్సిపల్ నీటి కుళాయి మీద ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు 12 గంటలు నీటి సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు... నాలుగైదు రోజుల నుంచి కేవలం 6 గంటలకే పరిమితం చేశారు. వీటి వల్ల రోగులు, రోగి తరఫు బంధువులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

నీళ్లు కొనుక్కొచ్చి వైద్యం

ఆస్పత్రిలో నీటి సమస్య తారా స్థాయికి చేరడం వల్ల వైద్యంపైనా ప్రభావం పడుతోంది. ప్రధానంగా డయాలసిస్ రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే రోగులకు రోజు 120 లీటర్ల నీరు అవసరం. ప్రతి రోజూ ఇలా 3వేల లీటర్ల కావాలి. కానీ నీటి కొరత వల్ల బయట నుంచి మినరల్ వాటర్ తెప్పించి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఈ నీళ్లు కూడా సరిపోకపోవడం వల్ల కొందరికి మాత్రమే డయాలసిస్ చేయగలుగుతున్నారు వైద్యులు. మరికొంత మంది నీటి కోసం ఆస్పత్రి పక్కనే ఉన్న హోటళ్లు, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. నీరు లేక శౌచాలయాలను కూడా మూసివేశారు. రోగులకు అత్యవసరం అనుకున్నప్పుడు బయట నుంచి నీటిని కొని తెచ్చుకొని మూత్రశాలలను వినియోగించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నీళ్లిప్పించండి

ఇంత పెద్ద ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రతరమైనప్పటికీ... అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి

ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ప్రతిరోజూ 1400 మంది చికిత్స పొందుతుంటారు. 500 మంది ఇన్ పేషేంట్​లుగా చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మరో 500 మంది వరకు వస్తుంటారు. 400 మంది వరకు ఆస్పత్రి సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు 3 వేల మంది వరకు ప్రతిరోజు ఆస్పత్రిలో ఉంటున్నా... వారికి తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరకట్లేదు. శౌచాలయానికి వెళ్లాలన్నా... బయట నుంచి నీరు కొనుక్కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాలుగు బోర్లున్నా... చుక్క నీరు లేదు

ఇందూరు ప్రభుత్వాస్పత్రిలో మొత్తం నాలుగు బోర్లు ఉండగా... ఇటీవల భూగర్భ జలాలు పడిపోయి రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మరో రెండు బోర్లలోనూ నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆస్పత్రిలో గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది గత కొన్నాళ్లుగా మున్సిపల్ నీటి కుళాయి మీద ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు 12 గంటలు నీటి సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు... నాలుగైదు రోజుల నుంచి కేవలం 6 గంటలకే పరిమితం చేశారు. వీటి వల్ల రోగులు, రోగి తరఫు బంధువులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

నీళ్లు కొనుక్కొచ్చి వైద్యం

ఆస్పత్రిలో నీటి సమస్య తారా స్థాయికి చేరడం వల్ల వైద్యంపైనా ప్రభావం పడుతోంది. ప్రధానంగా డయాలసిస్ రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే రోగులకు రోజు 120 లీటర్ల నీరు అవసరం. ప్రతి రోజూ ఇలా 3వేల లీటర్ల కావాలి. కానీ నీటి కొరత వల్ల బయట నుంచి మినరల్ వాటర్ తెప్పించి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఈ నీళ్లు కూడా సరిపోకపోవడం వల్ల కొందరికి మాత్రమే డయాలసిస్ చేయగలుగుతున్నారు వైద్యులు. మరికొంత మంది నీటి కోసం ఆస్పత్రి పక్కనే ఉన్న హోటళ్లు, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. నీరు లేక శౌచాలయాలను కూడా మూసివేశారు. రోగులకు అత్యవసరం అనుకున్నప్పుడు బయట నుంచి నీటిని కొని తెచ్చుకొని మూత్రశాలలను వినియోగించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నీళ్లిప్పించండి

ఇంత పెద్ద ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రతరమైనప్పటికీ... అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: లైవ్​: అరుణ్​ జైట్లీకి కన్నీటి నివాళి

Tg_nzb_10_24_govt_hospital_water_problem_pkg_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) పడిపోయిన భూగర్భ జలాలు.. ఎండిన బోర్లు.. సరిపోని కుళాయి నీరు.. వెరసి మంచి నీటి కోసం హాహాకారాలు... నీళ్లు లేక కంపు కొడుతున్న మూత్రశాలలు, మరుగు దొడ్లు. వాసన భరించలేక పోతున్న రోగులు, వారి బంధువులు. ఇదీ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి. నీళ్లు లేక ఆస్పత్రిలో పడే బాధలు ఒక ఎత్తయితే తాగేందుకు, ఇతర అవసరాలకు ఎడంతస్తుల మేడ దిగి ఎక్కాల్సిందే. మంచి నీళ్లయినా, మరుగుదొడ్డి కైనా నీళ్లు కింది నుంచి తెచుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. నీళ్లు లేక డయాలసిస్ వంటి వైద్య సేవలకూ ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని పరిష్కరించాల్సిన ఆస్పత్రి యంత్రాంగం, అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నీటి గోసపై ఈనాడు-ఈటీవీ పరిశీలన కథనం........ LOOOOOK Vo: నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతి రోజూ 1400 మంది అవుట్ పేషేంట్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. అలాగే 500 మంది ఇన్ పేషేంట్ లుగా చికిత్స తీసుకుంటున్నారు. ఇన్ పేషేంట్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరో 500 మంది ఉంటున్నారు. వీరితో పాటు ఆస్పత్రి సిబ్బంది మరో 400మంది విధుల్లో ఉంటారు. అంటే ప్రతి రోజూ ఆస్పత్రిలో ఉండే వారి సంఖ్య దాదాపు 3వేల మంది. ఇంతమంది ఉంటున్న ఈ పెద్దాసుపత్రిలో ప్రస్తుతం నీటికి కటకట ఏర్పడింది. గత నాలుగైదు రోజులుగా నీళ్లు లేక రోగులు, వారి బంధువులు బయట నుంచి తెచ్చుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు... spot Vo: నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం నాలుగు బోర్లు ఉండగా ఇటీవల భూగర్భ జలాలు పడిపోయి రెండు బోర్లు పూర్తిగా ఎండిపోగా.. మరో రెండు బోర్లలో నీళ్లు బాగా తగ్గిపోయాయి. దీంతో ఒక్కసారిగా నీటికి కొరత ఏర్పడింది. దీంతో మున్సిపల్ నీటి కుళాయి మీద ఆధారపడి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు 12గంటలు నీటి సరఫరా చేసిన మున్సిపల్ అధికారులు .. నాలుగైదు రోజులుగా కేవలం ఆరు గంటలకే పరిమితం చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎక్కడ చూసినా నీటి కోసం హాహాకారాలు వినిపిస్తున్నాయి.....bytes Bytes: రోగి బంధువు అన్నారం లక్ష్మి, రోగి బంధువు VO: ఆస్పత్రిలో గతంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది. దీంతో నీటి కోసం రోగులు పక్కనే ఉన్న బస్టాండ్ ప్రాంతంలోని హోటళ్ళు, దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. తాగేందుకు, కడుక్కోవడానికి, మూత్రశాలలు, మరుగుదొడ్డికి వెళ్లేందుకు.. ఇలా అవసరం ఏదైనా నీళ్లు బయట నుంచి కొనుగోలు చేసి తెచుకోవాల్సిందే. ఆస్పత్రిలో ఏ వార్డులో చూసినా బయట నుంచి తెచ్చుకున్న నీళ్ల బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. రోగుల బంధువులు మూత్ర, మరుగుదొడ్డి కోసం ప్రైవేట్ సులబ్ కాంప్లెక్స్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే రోగులకు మాత్రం తీవ్ర ఇబ్బంది అవుతోంది. మూత్ర శాలకు వెళ్లాలంటే తప్పక నీటిని బయట నుంచి తెచ్చుకొని వినియోగించాల్సి వస్తోందని వాపోతున్నారు....bytes Bytes: అత్తర్ సింగ్, రోగి బంధువు రోగి బంధువు, నిజామాబాద్ లలిత, రోగి బంధువు రోగి బంధువు, నిజామాబాద్ Vo: ఆస్పత్రిలో నీటి ఇబ్బంది తారా స్థాయికి చేరడంతో వైద్యంపైనా ప్రభావం పడుతోంది. ప్రధానంగా డయాలసిస్ రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డయాలసిస్ చేయించుకొనే రోగులకు 120 లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది. ప్రతి రోజూ ఇలా 3వేల లీటర్ల కావాలి. కానీ నీటి కొరత వల్ల బయట నుంచి మినరల్ వాటర్ తెప్పించి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ఈ నీళ్లు కూడా సరిపడా అందక ప్రతి రోజూ వచ్చిన వారిలో కొందరికే డయాలసిస్ చేయగలుగుతున్నారు. దీంతో డయాలసిస్ సమయానికి జరగక ప్రాణాల మీదకు వస్తోందని రోగులు ఆవేదన చెందుతున్నారు...bytes Bytes: నరేష్, టెక్నీషియన్, డయాలసిస్ సెంటర్ నర్సారెడ్డి, రోగి బబ్లూ, రోగి Evo: సమస్యను పరిష్కరించాల్సిన ఆస్పత్రి యంత్రాంగం, అధికారులు మిన్నకున్నారు. దీంతో రోగుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు..... END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.