ETV Bharat / state

పోలీసుల సేవలు మరువలేనివి: కలెక్టర్ నారాయణ రెడ్డి

author img

By

Published : Oct 21, 2020, 6:59 PM IST

నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసి చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. 24 గంటలు విధులు నిర్వహించే పోలీసుల సేవలు మరువలేనివని కలెక్టర్​ అన్నారు.

tributes-to-police-martyrs-in-nizamabad
పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు

నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసి చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. 24 గంటలు విధులు నిర్వహించే పోలీసుల సేవలు మరువలేనివని కలెక్టర్​ అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

పోలీసు అమరవీరులకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1987 నుంచి 2018 వరకు నిజామాబాద్ జిల్లాలో 19 మంది పోలీసులు అమరులైనట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శ్వేత, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు

నిజామాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసి చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. 24 గంటలు విధులు నిర్వహించే పోలీసుల సేవలు మరువలేనివని కలెక్టర్​ అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

పోలీసు అమరవీరులకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1987 నుంచి 2018 వరకు నిజామాబాద్ జిల్లాలో 19 మంది పోలీసులు అమరులైనట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శ్వేత, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు

ఇదీ చూడండి: నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.