నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇక్కట్లు పడుతున్నారని ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని..నాలుగు లైన్లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఈఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇవీ చూడండి: విద్యార్థుల సంఖ్య 890..మధ్యాహ్న భోజనానికి ఇక్కట్లు