ETV Bharat / state

తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యాభివృద్ధి వికసించాలి

పలు వివాదాలతో తెలంగాణ విశ్వవిద్యాలయం మారడంతో అభివృద్ధి కుంటుపడింది. ఐఏఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జి వీసీగా నియమించిన ఈ తరుణంలోనైనా పరిపాలనా పరమైన అంశాల్లో లోపాలు లేకుండా చూడాలి.. వర్సిటీలో నెలకొన్న వివాదాలను రూపుమాపి.. ఉన్నత విద్యా ప్రమాణాలు కాపాడేలా చర్యలు ఉండాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు.

author img

By

Published : Jul 27, 2019, 9:25 AM IST

తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యాభివృద్ధి వికసించాలి

తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటై పదమూడేళ్లయ్యింది. ఇక్కడ 26 కోర్సుల్లో విద్య అందుతోంది. ప్రధాన ప్రాంగణంతో పాటు భిక్కనూరులో దక్షిణ ప్రాంగణం కొనసాగుతోంది. కొత్త కోర్సులు మంజూరైనా ప్రారంభంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ప్రధాన ప్రాంగణానికి ఇంజినీరింగ్‌ కోర్సు మంజూరైనా ఏర్పాటు చేయటం లేదు. ఇక దక్షిణ ప్రాంగణంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, హిస్టరీ, తెలుగు, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, జువాలజీ కోర్సులకు అనుమతి లభించింది. ఇక్కడ భవనాల సదుపాయం ఉన్నా.. నాలుగు కోర్సులే కొనసాగిస్తున్నారు. న్యాక్‌ గుర్తింపుతో (రూసా రాష్ట్రీయ ఉచ్ఛతర అభియాన్‌) నిధులు రూ.20 కోట్లు మంజూరైనా తీసుకురావటంలో ఆలస్యమవుతోంది. పరీక్షల విభాగం, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాలతో పాటు ఆడిటోరియానికి ప్రత్యేకంగా ఏర్పాట్లకు గతంలో నిధులు మంజూరైనా ఆచరణలో ముందడుగు పడటంలేదు.

పరిపాలనాంశాల్లో వైఫల్యాలు
ఉద్యోగుల సమయపాలనపై నియంత్రణ లేకపోవటంతో ఎవరు ఎప్పుడొస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక్కడ బయోమెట్రిక్‌ విధానంలో హాజరు అమల్లో ఉన్నా.. దీనిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విధులకు హాజరు కాని కొందరు వారానికొకరోజు వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనంతటికీ కారణం వీరిని పర్యవేక్షించాల్సిన పోస్టుల్లో ఉన్నవారు సైతం ఇదే మార్గాన్ని అనుసరిస్తుండటంతో ప్రశ్నించేవారు లేకుండా పోయారు. ఇక కొన్ని పోస్టుల్లో రాజకీయ పలుకుబడితో వచ్చిన వారు ఉండి, తమ పెత్తనాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరి అర్హతల విషయంలో లోపాలున్నాయని పలుమార్లు విచారణల్లో తేలినా తమ పోస్టుకు ఎసరు రాకుండా జాగ్రత్త పడ్డారు.

పరిశోధనలకు ఏది అవకాశం?
పరిశోధన విభాగంలోని విద్యార్థులకు సరైన సౌకర్యాల్లేవు. సైన్స్‌ విభాగంలో పరికరాలు అందుబాటులో లేక ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వర్సిటీకి చెందిన అధ్యాపకులు డాక్టర్‌ బాలకిషన్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, శిరీష, శ్రీనివాస్‌లకు యూజీసీ, ఇతర ఫెలోషిప్‌లు వచ్ఛి. రూ.లక్షల్లో నిధులు మంజూరైనా ఇక్కడ పరిశోధనలు కొనసాగించే వెసులుబాటు లేకుండాపోయింది.

పరీక్షల్లో గందరగోళం
పరీక్షల నిర్వహణలో అకడమిక్‌ క్యాలెండర్‌ పాటించటంలో విఫలం అవుతున్నారు. ప్రశ్నపత్రాలు తారుమారు అయిన సందర్భాలున్నాయి. జవాబుదారీతనం లేక అభాసుపాలు అయ్యారని చెప్పాలి. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల జవాబు పత్రాల్లో అవకతవకలు జరిగాయని విచారణకు కమిటీలు వేసే వరకు వెళ్లింది. ఇక పరీక్షల ఫలితాల విడుదల్లోనూ ఆలస్యం చేయటం పరిపాటిగా మారిందనే చెప్పాలి.

వేతన వివాదాలు
వర్సిటీలో పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన జీవో 14ను అమలు చేయటంలో జాప్యం జరిగింది. ఒప్పంద అధ్యాపకులు వేతనాల విషయంలో జీవో 11 అమలు సందర్భంలోనూ ఇదే పరిస్థితి. కొందరిని మంజూరు పోస్టుల కింద చూపి పెంచారు. మరికొందరిని సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కింద చూపడంతో నష్టపోయారు. అదీగాక వేతనాల అమలు విషయంలో వ్యత్యాసాలు చూపటంతో వివాదం చెలరేగింది. పరిష్కారం కోసం కమిటీ వేసి నివేదిక సమర్పించినప్పటికీ మార్పు చేసే విషయంలో చొరవ చూపలేదు. అధ్యాపకుల పదోన్నతులను సైతం 2011 నుంచి ఆపారు. అకడమిక్‌ కన్సల్టెంట్స్‌, పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు, ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటై పదమూడేళ్లయ్యింది. ఇక్కడ 26 కోర్సుల్లో విద్య అందుతోంది. ప్రధాన ప్రాంగణంతో పాటు భిక్కనూరులో దక్షిణ ప్రాంగణం కొనసాగుతోంది. కొత్త కోర్సులు మంజూరైనా ప్రారంభంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ప్రధాన ప్రాంగణానికి ఇంజినీరింగ్‌ కోర్సు మంజూరైనా ఏర్పాటు చేయటం లేదు. ఇక దక్షిణ ప్రాంగణంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, హిస్టరీ, తెలుగు, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, జువాలజీ కోర్సులకు అనుమతి లభించింది. ఇక్కడ భవనాల సదుపాయం ఉన్నా.. నాలుగు కోర్సులే కొనసాగిస్తున్నారు. న్యాక్‌ గుర్తింపుతో (రూసా రాష్ట్రీయ ఉచ్ఛతర అభియాన్‌) నిధులు రూ.20 కోట్లు మంజూరైనా తీసుకురావటంలో ఆలస్యమవుతోంది. పరీక్షల విభాగం, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాలతో పాటు ఆడిటోరియానికి ప్రత్యేకంగా ఏర్పాట్లకు గతంలో నిధులు మంజూరైనా ఆచరణలో ముందడుగు పడటంలేదు.

పరిపాలనాంశాల్లో వైఫల్యాలు
ఉద్యోగుల సమయపాలనపై నియంత్రణ లేకపోవటంతో ఎవరు ఎప్పుడొస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక్కడ బయోమెట్రిక్‌ విధానంలో హాజరు అమల్లో ఉన్నా.. దీనిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విధులకు హాజరు కాని కొందరు వారానికొకరోజు వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనంతటికీ కారణం వీరిని పర్యవేక్షించాల్సిన పోస్టుల్లో ఉన్నవారు సైతం ఇదే మార్గాన్ని అనుసరిస్తుండటంతో ప్రశ్నించేవారు లేకుండా పోయారు. ఇక కొన్ని పోస్టుల్లో రాజకీయ పలుకుబడితో వచ్చిన వారు ఉండి, తమ పెత్తనాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరి అర్హతల విషయంలో లోపాలున్నాయని పలుమార్లు విచారణల్లో తేలినా తమ పోస్టుకు ఎసరు రాకుండా జాగ్రత్త పడ్డారు.

పరిశోధనలకు ఏది అవకాశం?
పరిశోధన విభాగంలోని విద్యార్థులకు సరైన సౌకర్యాల్లేవు. సైన్స్‌ విభాగంలో పరికరాలు అందుబాటులో లేక ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వర్సిటీకి చెందిన అధ్యాపకులు డాక్టర్‌ బాలకిషన్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, శిరీష, శ్రీనివాస్‌లకు యూజీసీ, ఇతర ఫెలోషిప్‌లు వచ్ఛి. రూ.లక్షల్లో నిధులు మంజూరైనా ఇక్కడ పరిశోధనలు కొనసాగించే వెసులుబాటు లేకుండాపోయింది.

పరీక్షల్లో గందరగోళం
పరీక్షల నిర్వహణలో అకడమిక్‌ క్యాలెండర్‌ పాటించటంలో విఫలం అవుతున్నారు. ప్రశ్నపత్రాలు తారుమారు అయిన సందర్భాలున్నాయి. జవాబుదారీతనం లేక అభాసుపాలు అయ్యారని చెప్పాలి. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల జవాబు పత్రాల్లో అవకతవకలు జరిగాయని విచారణకు కమిటీలు వేసే వరకు వెళ్లింది. ఇక పరీక్షల ఫలితాల విడుదల్లోనూ ఆలస్యం చేయటం పరిపాటిగా మారిందనే చెప్పాలి.

వేతన వివాదాలు
వర్సిటీలో పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన జీవో 14ను అమలు చేయటంలో జాప్యం జరిగింది. ఒప్పంద అధ్యాపకులు వేతనాల విషయంలో జీవో 11 అమలు సందర్భంలోనూ ఇదే పరిస్థితి. కొందరిని మంజూరు పోస్టుల కింద చూపి పెంచారు. మరికొందరిని సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కింద చూపడంతో నష్టపోయారు. అదీగాక వేతనాల అమలు విషయంలో వ్యత్యాసాలు చూపటంతో వివాదం చెలరేగింది. పరిష్కారం కోసం కమిటీ వేసి నివేదిక సమర్పించినప్పటికీ మార్పు చేసే విషయంలో చొరవ చూపలేదు. అధ్యాపకుల పదోన్నతులను సైతం 2011 నుంచి ఆపారు. అకడమిక్‌ కన్సల్టెంట్స్‌, పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు, ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.