తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు వీరికి ఘన స్వాగతం పలికారు. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి : ఏపీలో పొలిటికల్ హీట్... భాజపా-జనసేన నేతల గృహనిర్బంధం