నిజామాబాద్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫోటోకి కొమ్ములు పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన అర్వింద్... ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
రైతులకు కార్లు ఉన్నాయంటున్న ఎంపీకి ఎన్నికల్లో ఆ విషయం గుర్తుకు రాలేదా అని ధ్వజమెత్తారు. బాండ్పేపర్ మీద పసుపు బోర్డు 5రోజుల్లో తెస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా...స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. డిసెంబర్ 31 వరకు పసుపు బోర్డు తీసుకురాకపోతే... ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.
- ఇదీ చూడండి: ఇందూరులో అర్వింద్ను గెలిపించిన బాండ్ పేపర్