ETV Bharat / state

'మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదు.. తీసుకెళ్లిపోండి'

author img

By

Published : Nov 19, 2020, 2:19 PM IST

తమ స్కూల్​లో బాలికను చేర్పించాలని యాజమాన్యం తల్లిదండ్రులను కోరగా... వారు ఒప్పుకున్నారు. ఆన్​లైన్​ తరగతుల కోసం సెల్​ఫోన్​ కూడా కొన్నారు. క్లాసులు విన్న తర్వాత.. మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదంటూ యాజమాన్యం అడ్డుకున్న ఘటన బోధన్​లో చోటు చేసుకుంది.

student-and-her-mother-protest-against-of-minority-residential-school-in-bodhan
'మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదు.. తీసుకెళ్లిపోండి'

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ఊట్​పల్లిలో సురేందర్, ఉమ వారి కుమార్తె పల్లవి నివాసముంటున్నారు. లాక్​డౌన్​ సమయంలో బోధన్​కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు ఊట్​పల్లి గ్రామానికి వెళ్లి పల్లవిని తమ పాఠశాలలో చేర్పించండి అని అభ్యర్థించారు.

తల్లిదండ్రులు బాలికను స్కూలులో చేర్చి... ఆన్​లైన్​ తరగతుల కోసం ఫోన్​ కూడా కొన్నారు. ఇన్ని రోజులు క్లాసులు విన్న బాలికకు ఇప్పుడు ప్రవేశం లేదని చెప్పారు. మనస్తాపానికి గురైన ఉమ.. కూతురుతో కలసి పాఠశాల ముందు బైఠాయించింది. తమ బిడ్డ చదువుకోవడానికి సీటు​ ఇప్పించి.. సహాయం చేయాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ఊట్​పల్లిలో సురేందర్, ఉమ వారి కుమార్తె పల్లవి నివాసముంటున్నారు. లాక్​డౌన్​ సమయంలో బోధన్​కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు ఊట్​పల్లి గ్రామానికి వెళ్లి పల్లవిని తమ పాఠశాలలో చేర్పించండి అని అభ్యర్థించారు.

తల్లిదండ్రులు బాలికను స్కూలులో చేర్చి... ఆన్​లైన్​ తరగతుల కోసం ఫోన్​ కూడా కొన్నారు. ఇన్ని రోజులు క్లాసులు విన్న బాలికకు ఇప్పుడు ప్రవేశం లేదని చెప్పారు. మనస్తాపానికి గురైన ఉమ.. కూతురుతో కలసి పాఠశాల ముందు బైఠాయించింది. తమ బిడ్డ చదువుకోవడానికి సీటు​ ఇప్పించి.. సహాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి: ఇంకా సవాళ్ల మధ్యే 'ఆన్‌లైన్‌' అభ్యసనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.