నిజామాబాద్ నగరంలో దాదాపు నెలన్నర తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి విధానంలో దుకాణాలు తెరుచుకోవడానికి నగర పాలక సంస్థ అనుమతించింది. మిగిలిన ఎలక్ట్రికల్, హార్డ్వేర్, బట్టలు, రిపేరింగ్, ఇతర దుకాణాలు ఈ రోజు తెరుచుకున్నాయి. 50 శాతం మాత్రమే షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల దుకాణ నంబర్ ఆధారంగా తెరిచేందుకు అనుమతిస్తున్నారు.
దుకాణం బేసి సంఖ్య ఉంటే... బేసి తేదీన తెరవాలని నగర పాలక సంస్థ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్నటి వరకు జనం లేక రోడ్లన్నీ బోసిపోగా.. ఈరోజు రహదారులపై జనసందోహం కనిపించింది.
ఇదీ చూడండి: హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్