ETV Bharat / state

వరి ధాన్యం కుప్పలకు.. పసి ప్రాణం బలి - baby life road accident at kothapalli nizamabad

రోడ్డుపై ఇరువైపులా వరి ధాన్యం అరబెట్టడం వల్ల ఓ పసి బాలుడు బలయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

వరి ధ్యానం కుప్పలకు.. పసి ప్రాణం బలి
author img

By

Published : Nov 8, 2019, 12:38 PM IST

Updated : Nov 8, 2019, 4:26 PM IST

రోడ్డుపై ఇరువైపులా వరి ధాన్యం అరబెట్టడం వల్ల ఓ పసి బాబు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని భూమన్న అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విగ్నేష్ ఇంటి నుంచి ఉదయం పేస్టు కోసం రోడ్డు అవతల ఉన్న కిరాణా దుకాణానికని వెళ్లాడు. తిరిగి రోడ్డు దాటుతుండగా.. నందిపేట్ నుంచి నవీపేట్ వైపు లోడ్​తో వెళ్తున్న వడ్ల లారీ అతివేగంతో వచ్చి బాలుడి వైపు దూసుకెళ్లింది. రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు ఉన్నా డ్రైవర్ అతివేగంతో లారీ నడిపినందునే ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడని స్థానికులు చెప్తున్నారు.

మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. భయంతో లారీ డ్రైవర్ పారిపోయాడు. పది కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ వద్ద గ్రామస్థులు డ్రైవర్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రోడ్డుపై ఇరువైపులా వరి ధాన్యం అరబెట్టడం వల్ల ఓ పసి బాబు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని భూమన్న అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విగ్నేష్ ఇంటి నుంచి ఉదయం పేస్టు కోసం రోడ్డు అవతల ఉన్న కిరాణా దుకాణానికని వెళ్లాడు. తిరిగి రోడ్డు దాటుతుండగా.. నందిపేట్ నుంచి నవీపేట్ వైపు లోడ్​తో వెళ్తున్న వడ్ల లారీ అతివేగంతో వచ్చి బాలుడి వైపు దూసుకెళ్లింది. రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు ఉన్నా డ్రైవర్ అతివేగంతో లారీ నడిపినందునే ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడని స్థానికులు చెప్తున్నారు.

మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. భయంతో లారీ డ్రైవర్ పారిపోయాడు. పది కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ వద్ద గ్రామస్థులు డ్రైవర్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Intro:
రోడ్లపై వరి ధాన్యం అరబెట్టడంతో ఓ నిండు ప్రాణం బలైంది.నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్త పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.


Body:బైట్:
1)బాలుడి బంధువురాలు.


Conclusion:స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని భూమన్న అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఐతే పెద్ద కుమారుడు విగ్నేష్ ఇంటి నుంచి ఉదయం కిరణం షాపు కి వెళ్లాడని ఇంతలోనే నందిపేట్ నుండి నవిపెట్ వైపు లోడ్ తో వెళుతున్న వడ్ల లారీ ఓ ప్రక్కన రోడ్డు పై వరి ధ్యానం కుప్పలు ఉండటంతో బాలుడు వైపు దుకెళ్లింది.దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్నీ జిల్లా ఆసుపత్రికి తరలించారు...భయంతో లారీ డ్రైవర్ పారిపోతుండగా పది కిలోమీటర్ల దూరంలో గాంధీ నగర్ వద్ద గ్రామాస్తులు పట్టుకొని పోలీసులు అప్పగించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Last Updated : Nov 8, 2019, 4:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.