ఫ్లెక్సీల కల్చర్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాన్సువాడలో ఫ్లెక్సీలు బంద్ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా బాన్సువాడలో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బాన్సువాడను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీ పుత్రుడుగా ఉంటూ రాష్ట్రంలో నూతన మార్పులు తెస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో నిత్య విద్యార్థిగా అందరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సభాపతి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్