నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టరేట్కు ఆర్టీసీ సిటీ బస్సులు నడిచేలా చొరవ చూపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. త్వరలో నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించడం అభినందనీయమని.. నగర శివారులో ఉండటం వల్ల కలెక్టరేట్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి నూతన సమీకృత కలెక్టరేట్కు సిటీ బస్సులు నడపాలని కోరారు.
ఈ మేరకు ఫిర్యాదుల పెట్టె ద్వారా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల