నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల గ్రామ శివారులో పొలంలో ఉంచిన వరి ధాన్యం దగ్ధం అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాలలోని పిలకలకు నిప్పు పెట్టడం వల్ల అది పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు అంటుకుంది.
బినోల గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు చెందిన సుమారు 300 బస్తాల వరి ధాన్యం దగ్ధం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.