ETV Bharat / state

'నిజామాబాద్​లో శరవేగంగా అభివృద్ధి పనులు' - నిజామాబాద్ అభివృద్దిపై మేయర్ నీతూ కిరణ్ వ్యాఖ్యలు

నిజామాబాద్​లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆరో డివిజన్​లో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏకపాలరాతి కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కరోనా నుంచి త్వరగా బయటపడాలని అమ్మవారిని వేడుకున్నట్లు మేయర్ తెలిపారు.

nizamabad mayor inaugurates road works
'నిజామాబాద్​లో శరవేగంగా అభివృద్ధి పనులు'
author img

By

Published : Oct 20, 2020, 6:40 PM IST

నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆరో డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్​లో ఆర్​అండ్​బీ రూ.10లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రోజూ ఎదో ఒక డివిజన్​లో పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు.

ప్రత్యేక పూజలు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మేయర్ తెలిపారు. 300వ క్వార్టర్స్ వద్ద ఏక పాలరాతి శిల్ప కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నపూర్ణ మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి, శ్రీనివాస్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో లొల్లి.. సర్దిచేప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆరో డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్​లో ఆర్​అండ్​బీ రూ.10లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రోజూ ఎదో ఒక డివిజన్​లో పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు.

ప్రత్యేక పూజలు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మేయర్ తెలిపారు. 300వ క్వార్టర్స్ వద్ద ఏక పాలరాతి శిల్ప కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నపూర్ణ మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి, శ్రీనివాస్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో లొల్లి.. సర్దిచేప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.