పట్టా పాసు పుస్తకాల కోసం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి రైతులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట రైతులు బైఠాయించి ధర్నా చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు వక్ఫ్ భూములని చెప్పి తమకు పట్టాలివ్వకుండా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే రైతులకు పట్టాలిచ్చి సమస్యను పరిష్కరించాలని యెండల డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : నక్సల్స్ ఏరివేతపై సీఎంలతో అమిత్ షా సమీక్ష