నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరిన రైతులు లోక్సభ నియోజకవర్గాలకు నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నామపత్రాలు దాఖలు చేసేందుకు రైతులు బారులు తీరారు. పసుపు, ఎర్రజొన్న, చెరకు కర్షకులు నామినేషన్ వేసేందుకు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 50 మంది నామపత్రాలు దాఖలు చేశారు. పంటకు మద్దతు కల్పించాలనే డిమాండ్తో రైతులు పార్లమెంటు స్థానానికి పోటీకి దిగారు. ఇవాళ చెరకు రైతులు కూడా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రేంజల్ మండలం నుంచి భారీగా నామపత్రాలతో తరలివచ్చారు.భారీ బందోబస్తు:
వీరందరి రాకతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించారు.
ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు