వివిధ పథకాలపై రుణాలకు సంబంధించి బ్యాంకర్లు, జిల్లా అధికారులతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రగతి భవన్లో వ్యవసాయ రుణాలు, కొవిడ్ లోన్స్, బ్యాంకు లింకేజీ, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇండస్ట్రీస్, ఫిషరీస్, డైరీ, ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ సంబంధిత లోన్లపై కలెక్టర్ చర్చించారు.
వారంలో అన్నింటిని క్లియర్ చేయాలని, లోన్ వైవర్కు.. రెన్యూవల్కు సంబంధం లేదని నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని.. ఇందుకోసం జిల్లా అధికారులు ఎల్లప్పుడూ సహాయపడతారన్నారు. వీధి వ్యాపారుల నుంచి 17,200 అప్లికేషన్లు వచ్చాయని.. వారిలో అర్హులైన వారందరికీ త్వరితగతిన లోన్లు అందజేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం