ETV Bharat / state

'రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తాం'

author img

By

Published : May 3, 2021, 7:45 PM IST

జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. రైతులంతా అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

nizamabad collector
nizamabad collector

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు.. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో.. ఆయన టెలీ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

తక్కువగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తూకం వేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్​ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. రైతులంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు.. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో.. ఆయన టెలీ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

తక్కువగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తూకం వేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్​ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. రైతులంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.