ETV Bharat / state

Central Library: పుస్తకాల కొరతతో వెలవెలబోతున్న గ్రంథాలయాలు... ఉద్యోగార్థుల ఆవేదన - నిజామాబాద్ కేంద్ర గ్రంథాలయం వార్తలు

Books shortage in libraries: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్న వేళ నిరుద్యోగులు గ్రంథాలయాల బాటపడుతున్నారు. కొంతమంది కోచింగ్ సెంటర్లకు వెళ్తుండగా మరికొందరు గంటల తరబడి గ్రంథాలయాల్లో చదువుతున్నారు. అయితే పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర లైబ్రరీల్లో కొంత మేర లభిస్తున్నా గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల ఊసే లేకుండా పోతోంది. దీంతో దిన పత్రికలు చదవడానికి తప్ప మరే విధంగా గ్రంథాలయాలు ఉపయోగపడటం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Books shortage in libraries
Books shortage in libraries
author img

By

Published : Nov 23, 2021, 2:01 PM IST

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు లేక అభ్యర్థుల ఇబ్బందులు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు ఆసక్తి చూపిస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉద్యోగార్థులు సిద్ధమవుతున్నారు. పలువురు శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్తుండగా అనేక మంది స్థానిక గ్రంథాలయాల బాట పడుతున్నారు. వాటిల్లో వసతులు, తగినన్ని పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో అభ్యర్థులకు సమస్యగా(Books shortage nizamabad Library) మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర గ్రంథాలయాలు రెండు ఉన్నాయి. మరో 43శాఖా గ్రంథాలయాలు కలవు. గ్రామీణ ప్రాంతంలో 20 గ్రంథాలయాలున్నాయి. మొత్తం 6.03లక్షల పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండగా... ప్రతి రోజూ 5వేలకు పైగా మంది గ్రంథాలయాలకు వచ్చి చదువుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 85 మంది సిబ్బంది ఉండాల్సినా.. 33 మంది మాత్రమే పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ (nizamabad Library latest news) సంస్థ కార్యదర్శికే కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయాలకు ఇంఛార్జిగా బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిత్యం 500 మందికి పైగా చదువుకునేందుకు వస్తారు. 300 కుర్చీలు మాత్రమే ఉండటంతో సరిపోవడం (No facilities in nizamabad library) లేదు. గ్రూప్-1, సివిల్స్ సంబంధిత పుస్తకాల కొరత ఉద్యోగార్థులను(comitative Books shortage in Library) వేధిస్తోంది. ఈ-గ్రంథాలయంగా (Digital library) మార్చేందుకు గతంలో ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి... ప్రతి పుస్తకానికి బార్ కోడ్ వేసేందుకు యత్నించారు. కానీ సిబ్బంది లేక నిర్వహణ సరిగ్గా సాగడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నా అన్ని గ్రంథాలయాల్లో ఇంకా కొరత వేధిస్తూనే ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

నిజామాబాద్‌లోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని(nizamabad central Library) కొత్తగా నిర్మించామని గెజిటెడ్ లైబ్రేరియన్ అధికారిణి లక్ష్మీరాజ్య తెలిపారు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం సంబంధిత 80వేల వరకు పుస్తకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మిగిలిన గ్రంథలయాల్లోనూ పోటీ పరీక్షల పుస్తకాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరటంతో అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది కొరత వేధిస్తున్నా తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. వీలైనంత వరకు గ్రూప్-1, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరత లేకుండా చేస్తామని లక్ష్మీరాజ్య తెలిపారు.

ఇదీ చదవండి: Visa Issues: నిబంధనలు, మోసాలతో.. పుట్టింట్లోనే మగ్గుతున్న యువతులు

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు లేక అభ్యర్థుల ఇబ్బందులు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు ఆసక్తి చూపిస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉద్యోగార్థులు సిద్ధమవుతున్నారు. పలువురు శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్తుండగా అనేక మంది స్థానిక గ్రంథాలయాల బాట పడుతున్నారు. వాటిల్లో వసతులు, తగినన్ని పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో అభ్యర్థులకు సమస్యగా(Books shortage nizamabad Library) మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర గ్రంథాలయాలు రెండు ఉన్నాయి. మరో 43శాఖా గ్రంథాలయాలు కలవు. గ్రామీణ ప్రాంతంలో 20 గ్రంథాలయాలున్నాయి. మొత్తం 6.03లక్షల పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండగా... ప్రతి రోజూ 5వేలకు పైగా మంది గ్రంథాలయాలకు వచ్చి చదువుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 85 మంది సిబ్బంది ఉండాల్సినా.. 33 మంది మాత్రమే పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ (nizamabad Library latest news) సంస్థ కార్యదర్శికే కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయాలకు ఇంఛార్జిగా బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిత్యం 500 మందికి పైగా చదువుకునేందుకు వస్తారు. 300 కుర్చీలు మాత్రమే ఉండటంతో సరిపోవడం (No facilities in nizamabad library) లేదు. గ్రూప్-1, సివిల్స్ సంబంధిత పుస్తకాల కొరత ఉద్యోగార్థులను(comitative Books shortage in Library) వేధిస్తోంది. ఈ-గ్రంథాలయంగా (Digital library) మార్చేందుకు గతంలో ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి... ప్రతి పుస్తకానికి బార్ కోడ్ వేసేందుకు యత్నించారు. కానీ సిబ్బంది లేక నిర్వహణ సరిగ్గా సాగడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నా అన్ని గ్రంథాలయాల్లో ఇంకా కొరత వేధిస్తూనే ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

నిజామాబాద్‌లోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని(nizamabad central Library) కొత్తగా నిర్మించామని గెజిటెడ్ లైబ్రేరియన్ అధికారిణి లక్ష్మీరాజ్య తెలిపారు. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం సంబంధిత 80వేల వరకు పుస్తకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మిగిలిన గ్రంథలయాల్లోనూ పోటీ పరీక్షల పుస్తకాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరటంతో అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది కొరత వేధిస్తున్నా తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. వీలైనంత వరకు గ్రూప్-1, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరత లేకుండా చేస్తామని లక్ష్మీరాజ్య తెలిపారు.

ఇదీ చదవండి: Visa Issues: నిబంధనలు, మోసాలతో.. పుట్టింట్లోనే మగ్గుతున్న యువతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.