ETV Bharat / state

భారీ వర్షానికి తడిసిన ధాన్యం...రైతన్నకు తీవ్ర నష్టం - నిజామాబాద్ జిల్లా వార్తలు

ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు భారీ వర్షం కన్నీళ్లు మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నిజామాబాద్‌లోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.

Heavy rain nizamabad crop fields damaged
భారీ వర్షానికి తడిసిన ధాన్యం...రైతన్నకు తీవ్ర నష్టం
author img

By

Published : Oct 12, 2020, 7:29 PM IST

నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతన్న విలవిల్లాడిపోయాడు. పంట చేతికొచ్చిందన్న ఆనందమే లేకుండా దిగులు చెందుతున్నాడు. అల్పపీడనం వల్ల నిజామాబాద్ గ్రామీణ, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముందుగా వేయడం వల్ల తొందరగా చేతికొచ్చాయి. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఆరుబయటే ధాన్యం నిల్వ ఉంచాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం

నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతన్న విలవిల్లాడిపోయాడు. పంట చేతికొచ్చిందన్న ఆనందమే లేకుండా దిగులు చెందుతున్నాడు. అల్పపీడనం వల్ల నిజామాబాద్ గ్రామీణ, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముందుగా వేయడం వల్ల తొందరగా చేతికొచ్చాయి. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఆరుబయటే ధాన్యం నిల్వ ఉంచాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: అకాల వర్షం.. రైతులకు తీరని నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.