ETV Bharat / state

అక్కడ మద్యం కొనాలంటే వైన్స్​కు వెళ్లక్కర్లేదు - 'బండి'లో అదే మన ఇంటికి వస్తుంది! - LIQUOR SALES IN A CART

తోపుడు బండిలో మద్యం విక్రయాలు - ఓ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు - క్వార్టర్ సీసాలను ధ్వంసం చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

Liquor Sales in a Cart in Gachibowli
Liquor Sales in a Cart in Gachibowli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 1:03 PM IST

Liquor Sales in a Cart in Gachibowli : తోపుడు బండిలో మద్యం అమ్ముతున్న ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న 92 విస్కీ క్వార్టర్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. కొండాపూర్‌ జేవీజీ హిల్స్‌ కాలనీలోని ఫుట్‌పాత్‌పై ఓ డబ్బాలో మద్యం అమ్మకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజల ఫిర్యాదుతో శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌ రెడ్డి గురువారం ఉదయం 6.30 గంటలకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 10 క్వార్టర్‌ సీసాలు లభించాయి. ఆ క్వార్టర్ సీసాలను ధ్వంసం చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై అక్రమంగా వేసిన డబ్బాను తొలగించారు.

సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీలో సైతం ఇదే తరహాలో మద్యం అమ్ముతున్నట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. తోపుడు బండిలో సిగరెట్లు అమ్ముతున్న ఓ మహిళ అదే బండిలో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు తోపుడు బండిలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Liquor Sales in a Cart in Gachibowli : తోపుడు బండిలో మద్యం అమ్ముతున్న ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న 92 విస్కీ క్వార్టర్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. కొండాపూర్‌ జేవీజీ హిల్స్‌ కాలనీలోని ఫుట్‌పాత్‌పై ఓ డబ్బాలో మద్యం అమ్మకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజల ఫిర్యాదుతో శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌ రెడ్డి గురువారం ఉదయం 6.30 గంటలకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 10 క్వార్టర్‌ సీసాలు లభించాయి. ఆ క్వార్టర్ సీసాలను ధ్వంసం చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై అక్రమంగా వేసిన డబ్బాను తొలగించారు.

సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీలో సైతం ఇదే తరహాలో మద్యం అమ్ముతున్నట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. తోపుడు బండిలో సిగరెట్లు అమ్ముతున్న ఓ మహిళ అదే బండిలో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు తోపుడు బండిలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

తోపుడు బండిలో లభించిన మద్యాన్ని చూపుతున్న శ్రీకాంత్‌రెడ్డి
తోపుడు బండిలో లభించిన మద్యాన్ని చూపుతున్న శ్రీకాంత్‌రెడ్డి (ETV Bharat)

ఆ 17 పట్టణాల్లో మద్యం షాపులు బంద్- ఆ రాష్ట్ర సర్కార్​ సంచలన నిర్ణయం

ఆ ఊరివాసులు 12 ఏళ్లుగా తాగడం లేదు - ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.