ETV Bharat / state

భక్తులు లేక వెలవెలబోయిన సాయి మందిరాలు

author img

By

Published : Jul 5, 2020, 2:43 PM IST

నిజామాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా భక్తులు లేక సాయి మందిరాలు వెలవెలబోయాయి. కొన్నిచోట్ల మాస్కులు ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు.

Guru Pournami Festival Celebrations in Nizamabad district
నిరాడంబరంగా గురుపౌర్ణమి వేడుకలు

కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు ఆలయాలకు అంతంత మాత్రంగానే వచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. థర్మల్ స్క్రీనింగ్ చేయటంతోపాటు శానిటైజర్​లు అందుబాటులో ఉంచారు. మాస్కు​లు ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి. నగర శివారు మాధవనగర్ లోని సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ భక్తులను అనుమతించారు. అలాగే నగరంలోని హమాల్ వాడీ సాయిబాబా ఆలయం, తేనె సాయిబాబా మందిరం, గాజుల్ పేట్ దత్తమందిరం, న్యాల్​కల్ రోడ్డు లలితాదేవి దత్తాలయంలో గురుపౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది.

కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు ఆలయాలకు అంతంత మాత్రంగానే వచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. థర్మల్ స్క్రీనింగ్ చేయటంతోపాటు శానిటైజర్​లు అందుబాటులో ఉంచారు. మాస్కు​లు ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి. నగర శివారు మాధవనగర్ లోని సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ భక్తులను అనుమతించారు. అలాగే నగరంలోని హమాల్ వాడీ సాయిబాబా ఆలయం, తేనె సాయిబాబా మందిరం, గాజుల్ పేట్ దత్తమందిరం, న్యాల్​కల్ రోడ్డు లలితాదేవి దత్తాలయంలో గురుపౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.