తెరాస, భాజపావి ప్రజావ్యతిరేక ప్రభుత్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మధుయాస్కీకి మద్దతుగా ఇందూరులో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ప్రాంతంలో రైతులు పండించే ఎర్రజొన్న, పసుపు, వరి తదితర పంటలకు మద్దతు ధరను కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి 15 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రైతుల గురించి పార్లమెంట్లో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పటికీ ఈ ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. మధుయాస్కీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆజాద్ కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మళ్లీ నిజాం పాలన కన్పిస్తోంది