ETV Bharat / state

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ.. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు.

author img

By

Published : Mar 7, 2021, 5:01 PM IST

Free cancer screening tests at nizamabad District Govt hospital
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​లోని ఇందూర్​ కాన్సర్ హాస్పిటల్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. జిల్లా ప్రభుత్వాసుపత్రి మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మహిళలు.. తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని మేయర్​ సూచించారు. గృహిణి బాగుంటేనే.. కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం వల్లే.. క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్​ ప్రతిమా రాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్​లోని ఇందూర్​ కాన్సర్ హాస్పిటల్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. జిల్లా ప్రభుత్వాసుపత్రి మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మహిళలు.. తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని మేయర్​ సూచించారు. గృహిణి బాగుంటేనే.. కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం వల్లే.. క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్​ ప్రతిమా రాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా కానిస్టేబుల్​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.