![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
మద్దతు ధర కోసం ఈ నెల 7న ధర్నా చేపడితే... న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ తమ వద్దకు రాలేదని మండిపడ్డారు. అధికారుల తీరు నిరసిస్తూ.. ధర్నాకి దిగామన్నారు. మద్దతు ధర కల్పించే వరకు తమ నిరసనలు ఆగవని స్పష్టం చేశారు.
పసుపు పండించేందుకు ఎకరాకు లక్షాయాభై వేల వరకు ఖర్చు వస్తే... పంట అమ్మితే కేవలం 80 వేలే వస్తున్నాయని చెప్తున్నారు.
రైతన్నలు రోజంతా జాతీయరహదారిని దిగ్బంధించారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు ముందుగానే మహాధర్నాకు పిలుపునిచ్చినప్పటికీ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ధర్నాకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్మూర్ పట్టణం సహా 13 మండలాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.