నిజామాబాద్ నగరంలోని పోలీస్హెడ్క్వార్టర్స్ ప్రశాంతి నిలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా తానే స్వయంగా రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది, ఇతర యువకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు