నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య కళాశాలకు దానం చేశారు. నగరంలోని కోటగల్లికి చెందిన ఆకుల మల్లవ్వ(90) సోమవారం మృతి చెందగా.. కళ్లను లయన్స్ క్లబ్కు ఇచ్చారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలకు మంగళవారం దానం చేశారు.
సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను జరిపిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కళాశాల ప్రతినిధులకు అప్పగించారు.
ఇదీ చదవండి: 'ఆత్మనిర్భర్ భారత్కు సరకు రవాణా కీలకం'