ఈ నెల 10న లింగన్న సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐ నిజామాబాద్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. లింగన్నది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి పేర్కొన్నారు. పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యగా ఆయన అభివర్ణించారు. ఆదివాసుల హక్కులు, ప్రజాస్వామిక తెలంగాణ కోసం న్యూడెమోక్రసీ పోరాటం కొనసాగుతుందని యాదగిరి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఆర్టికల్ 370 సమస్యకు పరిష్కారం 370నే