ETV Bharat / state

భాజపా నుంచి తెరాసలో చేరిన కార్పొరేటర్లు

author img

By

Published : May 16, 2020, 12:08 AM IST

నిజామాబాద్​ పట్టణానికి చెందిన ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​లోని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి నివాసంలో నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే గణేష్​ బిగాల ఆధ్వర్యంలో ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తెరాసలో చేరారు. మంత్రి ప్రశాంత్​ రెడ్డి వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Bjp Corporaters  joins In Trs In Nizamabad
భాజపా నుంచి తెరాసలో చేరిన కార్పోరేటర్లు

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వలసలు మొదలయ్యాయి. పట్టణ కేంద్రానికి చెందిన ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నిజామాబాద్​ తొమ్మిదో డివిజన్​ కార్పొరేటర్​ సాయివర్ధన్​, ఎనిమిదో డివిజన్​ కార్పొరేటర్​ విక్రంగౌడ్, 50వ డివిజన్​ కార్పొరేటర్​ బట్టు రాఘవేందర్​లు మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​లోని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి నివాసంలో నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే గణేష్​ బిగాల ఆధ్వర్యంలో ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తెరాసలో చేరారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలన, పలు సంక్షేమ కార్యక్రమాలు చూసి తెరాసలో చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు.

తెరాస ప్రజల కోసం పని చేస్తున్నందున అందరూ తెరాసతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. కార్పొరేటర్ల కంటే ముందు నందిపేట్ భాజపా జడ్పీటీసీ కూడా తెరాసలో చేరారు. తాజాగా.. నిజామాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడిగా బస్వ లక్ష్మి నర్సయ్య బాధ్యతలు తీసుకోగా.. భాజపా నుంచి తెరాసలోకి వలసలు ప్రారంభం కావడం గమనార్హం.

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వలసలు మొదలయ్యాయి. పట్టణ కేంద్రానికి చెందిన ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నిజామాబాద్​ తొమ్మిదో డివిజన్​ కార్పొరేటర్​ సాయివర్ధన్​, ఎనిమిదో డివిజన్​ కార్పొరేటర్​ విక్రంగౌడ్, 50వ డివిజన్​ కార్పొరేటర్​ బట్టు రాఘవేందర్​లు మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​లోని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి నివాసంలో నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే గణేష్​ బిగాల ఆధ్వర్యంలో ముగ్గురు భాజపా కార్పొరేటర్లు తెరాసలో చేరారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలన, పలు సంక్షేమ కార్యక్రమాలు చూసి తెరాసలో చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు.

తెరాస ప్రజల కోసం పని చేస్తున్నందున అందరూ తెరాసతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. కార్పొరేటర్ల కంటే ముందు నందిపేట్ భాజపా జడ్పీటీసీ కూడా తెరాసలో చేరారు. తాజాగా.. నిజామాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడిగా బస్వ లక్ష్మి నర్సయ్య బాధ్యతలు తీసుకోగా.. భాజపా నుంచి తెరాసలోకి వలసలు ప్రారంభం కావడం గమనార్హం.

ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.